Friday 11 September 2015

శ్రీ లక్ష్మీ గాయత్రీ మంత్రం


ధన-ధాన్యాలు, భోగ-భాగ్యాలు, సుఖ-సంతోషాలు మనందరికీ కావాలి. మరి అందుకోసం ఈ మంత్రం ప్రతి నిత్యం-ముఖ్యంగా ప్రతి శుక్రవారం జపం చేస్తే ఫలప్రదం. ఇవాళ ఆఖరి శ్రావణ శుక్రవారం. మరి ఈ రోజు నుండే మంత్రం జపం ప్రారంభిద్దాం . 

ప్రొద్దున్న, సాయంత్రం దేవుని దెగ్గర దీపం పెట్టి జపం చేస్తే మంచిది. ఆవునేయ్యితో దీపం పెట్టడం ఉత్తమం. 

సాయంత్రం దీపం పెట్టలేకపోయినా, శుచిగా కాళ్ళు చేతులు కడుక్కుని, శుభ్రమైన వస్త్రాలను ధరించి, చేస్తే బాగుంటుంది. 108 సార్లు లేదా కనీసం 21 /11 సార్లు చేయగలిగితే మంచిది. 

ముఖ్యంగా శుక్రవారం సాయం సమయంలో కూడా దీపం వెలిగించి చేస్తే ఎక్కువ ఫలితం ఇస్తుంది అని పెద్దలు అంటారు. 



మీ...అనామిక....

No comments: